

శ్రావణ మాసం ప్రారంభంతో తెలుగు ఇళ్లలో పండుగల సందడి నెలకొంది. వివాహిత మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 21నా లేదా 28నా అనే గందరగోళంపై పంచాంగ పండితులు స్పష్టతనిచ్చారు. సనాతన ధర్మం ప్రకారం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే ప్రధాన వరలక్ష్మీ వ్రతంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ ఏడాది ఆగస్టు 28నే వ్రతాన్ని ఆచరించాలని పండితులు పేర్కొన్నారు.
ఆగస్టు 21 కూడా శ్రావణ శుక్రవారమే అయినప్పటికీ, పౌర్ణమికి సమీపంలో ఉన్న శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అయితే వ్యక్తిగత లేదా ఆరోగ్య కారణాల వల్ల ఆగస్టు 28న వ్రతం చేయలేని వారు ఆగస్టు 21న లేదా ఇతర శుక్రవారాల్లో ఆచరించవచ్చని సూచించారు. ఆగస్టు 28న పూజా ముహూర్తాలు ఉదయం 06:23 నుంచి 08:40 వరకు, మధ్యాహ్నం 01:00 నుంచి 03:12 వరకు, సాయంత్రం 07:10 నుంచి 08:50 వరకు శుభప్రదంగా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!