
బిజినెస్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పొగాకు మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా ఎఫ్సీవీ (FCV) పొగాకు రైతులు నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మార్కెట్ పరిస్థితులపై నిరంతర నిఘా ఉంచి, ఎఫ్సీవీ పొగాకు ధర కిలోకు రూ.200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!