
జనరల్

ఆంటోనీ వర్గీస్, సునీల్, దుషారా విజయన్, కబీర్ దుహాన్ సింగ్, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. రవి బస్రూర్, అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. మే 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మనోరమా మ్యాక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది. యాక్షన్, క్రైమ్ అంశాలతో తెరకెక్కిన ‘కాటాలన్’ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను అందుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!