
గాసిప్స్

విశాఖపట్నం సమీపంలోని భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఈ ప్రత్యేక విమానంలో భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు వచ్చారు.
భోగాపురం విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 తర్వాత రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే, రెగ్యులర్ సర్వీసులకు ముందుగానే ప్రత్యేక విమానాల ల్యాండింగ్ ప్రారంభమైంది. ఒకే ప్రత్యేక విమానంలో పలువురు రాజకీయ ప్రముఖులు రావడం కాకతాళీయంగా జరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!