

విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయవంతంగా కక్ష్యలోకి చేరడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనతతో భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిందని పేర్కొన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్ సంస్థలకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీపడే స్థాయికి చేరుకుందని ఈ విజయం నిరూపించిందన్నారు.
ఇది భారత అంతరిక్ష రంగంలో కొత్త యుగానికి నాంది అని సీఎం అన్నారు. శాస్త్రీయ సంస్థల సామర్థ్యం, భారతీయ పారిశ్రామికవేత్తల సృజనాత్మకత కలిసినప్పుడు ఆవిష్కరణలకు కొత్త హద్దులు ఏర్పడతాయని ఈ విజయం చాటిచెప్పిందన్నారు. ఈ విజయాన్ని సాధించిన వేలాదిమంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, భాగస్వామ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఈ ఘనత ప్రతి భారతీయుడికి గర్వకారణమని, భావితరాల యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!