

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1ను ‘మిషన్ ఆగమన్’ పేరుతో శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగాన్ని మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్తో కలిసి లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించారు.
స్కైరూట్ ఏరోస్పేస్ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్-1లో ప్రొపల్షన్ సిస్టమ్స్, 3డీ ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన రాకెట్ బూస్టర్లు అమర్చారు. సుమారు 350 కిలోల బరువున్న నాలుగు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా దీనిని రూపొందించారు. గ్రహాస్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థల టెక్నాలజీ డెమో పేలోడ్లతో పాటు స్కైరూట్కు చెందిన ‘స్కోప్’ ఉపగ్రహం, కాస్మోస్ డైమండ్స్కు చెందిన కళాకృతులను కూడా రోదసిలోకి తీసుకెళ్లింది. ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్ కుమార్ చందన, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే. నారాయణ పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!