
జనరల్

స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతం కావడంతో శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే షార్ కంట్రోల్ రూమ్లో ఉన్న శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో స్కైరూట్ ఏరోస్పేస్కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయోగాన్ని వీక్షించిన ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్, మాజీ ఛైర్మన్లు, పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు చప్పట్లతో స్కైరూట్ బృందాన్ని అభినందించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది కీలక మైలురాయిగా నిలిచిందని పలువురు ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!