

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చెన్నైలోని ప్రభుత్వ విద్యార్థుల హాస్టల్ను ఆకస్మికంగా సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆహార నాణ్యత, పరిశుభ్రత లోపాలు, నీటి సమస్యలు, భద్రతా సౌకర్యాల కొరత, సిబ్బంది లేమి వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే లైబ్రరీలో మరిన్ని పుస్తకాలు, క్రీడా సదుపాయాలు, రాత్రి ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు అనుకూలమైన హాస్టల్ నిర్వహణ ఉండాలని కోరారు.
విద్యార్థుల ఫిర్యాదులను ఓపికగా విన్న సీఎం విజయ్ హాస్టల్లోని వంటగది, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రూ.44.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హైటెక్ హాస్టల్లో అన్ని లోపాలను త్వరగా సరిచేయాలని సూచించిన ఆయన, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే విధంగా వరుసగా ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!