
సినిమాలు

తాజా సీవోటర్ స్నాప్ పోల్ ప్రకారం, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని మోదీ ప్రభుత్వం నిర్వహించిన తీరుపై సగానికి పైగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎన్డీఏ ఓటర్లలో 40 శాతం మంది కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం ఎన్డీఏ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కలిగించిందని సర్వే పేర్కొంది.
అదే సమయంలో, భారత యువతలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా రాహుల్ గాంధీపై 12 శాతం పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సర్వే తెలిపింది. 12 శాతం మంది సీజేపీని యువత గొంతుకగా అభివర్ణించగా, దాదాపు 50 శాతం మంది భవిష్యత్తులో ఇతర ప్రజా సమస్యలపైనా ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలిపారు. యువతలో పెరుగుతున్న నిరాశే ప్రభుత్వానికి ప్రధాన సవాలని సర్వే అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!