

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్లో నిర్వహించిన 19వ ఆట జాతీయ మహాసభల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవాస భారతీయులకు కీలక సందేశం ఇచ్చారు. ప్రపంచ స్థాయి అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతోందని పేర్కొంటూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పుట్టిన గడ్డ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సింగిల్ విండో విధానంలో వేగవంతమైన అనుమతులు, పారిశ్రామిక మరియు సామాజిక కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి తెలిపారు. మూసీ నది పునరుద్ధరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులను వివరించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు, వారి కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడిస్తూ, ప్రవాసులు ఆన్లైన్లో ఓటు హక్కు నమోదు చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!