
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. ప్రతి ఏడాది చేపట్టే సంప్రదాయంలో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం దీక్ష స్వీకరించారు. ఆలయ ఈవో సునీల్ కుమార్, అర్చకులు రాజగోపురం వద్ద పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు.
గురుముఖంగా పొందిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం నాలుగు నెలల పాటు ఈ ఆధ్యాత్మిక దీక్షను ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!