
రాజకీయాలు

ఫోక్ డ్యానర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫోక్ డ్యాన్సర్ జాను లిరి స్పందిస్తూ.. కొందరి వ్యక్తిగత విషయాలను మొత్తం ఫోక్ ఇండస్ట్రీకి ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు.
జానపద కళను కాపాడేందుకు ఫోక్ కళాకారులు ఎంతో కష్టపడుతున్నారని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ తమ కళను ముందుకు తీసుకెళ్తున్నారని జాను లిరి పేర్కొన్నారు. కొందరి వ్యక్తిగత వ్యవహారాలను ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలుగా చిత్రీకరించడం సరికాదని ఆమె అన్నారు. వ్యక్తిగత అంశాలను, మొత్తం కళా రంగాన్ని వేర్వేరుగా చూడాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!