

ఈ20 పెట్రోల్ (80 శాతం పెట్రోల్ + 20 శాతం ఎథనాల్) వినియోగంపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం పార్లమెంట్లో మాట్లాడుతూ, వాహనం మోడల్, తయారీ సంవత్సరం ఆధారంగా ఈ20 ఇంధనం వాడితే మైలేజీ 2 నుంచి 6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంగీకరించారు. అయితే ఈ20 పెట్రోల్ వల్ల ఇంజిన్ ఫెయిల్యూర్లు వస్తాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఏఆర్ఏఐ (ARAI), సియామ్ (SIAM), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నిర్వహించిన అధ్యయనాల్లో ఈ20 ఇంధనం వాహనాలకు సురక్షితమని తేలినట్లు తెలిపారు.
ఈ20 ఇంధనం వల్ల మెరుగైన యాక్సిలరేషన్, మెరుగైన రైడ్ క్వాలిటీ లభిస్తుందని, ఈ10 ఇంధనంతో పోలిస్తే సుమారు 30 శాతం తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని గడ్కరీ పేర్కొన్నారు. 2016కు ముందు తయారైన కొన్ని బీఎస్-III వాహనాల్లో రబ్బర్ భాగాలు, గాస్కెట్లను సాధారణ సర్వీసింగ్ సమయంలో మార్చాల్సి రావచ్చని, అయితే ఇంజిన్లో ఎలాంటి మార్పులు అవసరం లేదని వివరించారు. ప్రభుత్వం ఈ20 ఇంధనాన్ని శాస్త్రీయంగా, దశలవారీగా అమలు చేస్తోందని, ఈ20 వాహనాల వారంటీలను ఆటోమొబైల్ కంపెనీలు గౌరవిస్తున్నాయని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!