
జనరల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మధ్య మంచి సమన్వయం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉండాలని తాము కోరుకున్నామని, అయితే సభలో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ పార్టీ సస్పెన్షన్కు గురైందని శ్రీధర్ బాబు విమర్శించారు. అసెంబ్లీ అంటే బీఆర్ఎస్కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువ రోజులు సభను నిర్వహించలేదని, ఇప్పుడు తాము సభను నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉండటం లేదని విమర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!