
జనరల్

మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలతో పాటు రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం రూ.116 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో చేపల ఉత్పత్తి పెరిగి మత్స్యకారులకు స్థిరమైన ఆదాయం లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ పథకం అమలు కోసం అవసరమైన చేపలు, రొయ్య పిల్లల కొనుగోలుకు టెండర్లు పిలవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే సుమారు 90 కోట్ల చేపలు, రొయ్య పిల్లలను రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో ఉచితంగా విడుదల చేయనుంది. దీంతో మత్స్య సంపద పెరగడంతో పాటు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!