
క్రీడలు

ఇస్లామాబాద్లో జరగాల్సిన కాల్పుల విరమణ చర్చలు జరగలేదు. అదే సమయంలో హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత టెన్షన్గా మారింది. డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరిగింది.
ఈ కాల్పులు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) చేసినవేనని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇరాన్ కూడా ఈ దాడిని ఒప్పుకున్నప్పటికీ కారణాలు చెప్పలేదు. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతినిధి అమెరికాతో చర్చలకు సిద్ధమని చెప్పాడు. అయితే తమ నౌకలపై ఉన్న దిగ్బంధనాన్ని తొలగించాలని షరతు పెట్టాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!