
ఆరోగ్యం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇవ్వనున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థికంగా అండగా నిలవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. పిల్లల భవిష్యత్తు, విద్యతో పాటు కుటుంబ సంక్షేమానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!