

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రైల్వే టికెట్ను స్వయంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి తొలి ప్రయాణం చేశారు. అంతకుముందు కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించిన ఆయనకు ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తర్వాత రైల్వే స్టేషన్కు చేరుకుని రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి గజ్వేల్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఈ కొత్త రైల్వే స్టేషన్తో కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి రైల్వే అనుసంధానం మరింత మెరుగుపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!