

అగ్రకథానాయిక దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన కుమార్తె దువా రెండో పుట్టినరోజు సందర్భంగా బేబీ బంప్తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు దీపికను ట్రోల్ చేశారు. ఆమె బేబీ బంప్ నిజమైనది కాదంటూ ‘ఫేక్ బేబీ బంప్’ అని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ ఇన్ఫ్లూయెన్సర్ తీవ్రంగా స్పందిస్తూ.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోని సున్నితమైన అంశాలపై ఇలాంటి ట్రోలింగ్ సరికాదని పేర్కొన్నారు.
చిన్నారి దువా అచ్చం రణ్వీర్ సింగ్లా కనిపిస్తోందని, తండ్రీకూతుళ్లు కాపీ-పేస్ట్లా ఉన్నారని ఇన్ఫ్లూయెన్సర్ అన్నారు. తొలి గర్భధారణ సమయంలోనూ దీపిక ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆమె మాతృత్వంలోని మధుర క్షణాలను ఆస్వాదించనివ్వాలని కోరారు. ఈ ఇన్ఫ్లూయెన్సర్ పోస్ట్ను దీపిక లైక్ చేసి తన మద్దతును తెలిపారు. దీపిక, రణ్వీర్ సింగ్ దంపతులు 2018లో వివాహం చేసుకున్నారు. 2024లో వీరికి తొలి సంతానంగా కుమార్తె జన్మించగా.. ఆమెకు దువా అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ దంపతులు రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!