
క్రీడలు

చెన్నై సమీపంలోని శివకాశి ప్రాంతంలో ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. పేలుడు తీవ్రతతో కర్మాగారంలో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం విజయ్ అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!