

తనను రాజీనామా చేయమని అడగకుండానే పదవి నుంచి బర్తరఫ్ చేశారని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. టీవీ9తో మాట్లాడిన ఆమె.. తనను ముందుగా సంప్రదించలేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్న రెండున్నరేళ్లలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని, తన పేషీకి వచ్చిన ప్రతి పనిని న్యాయంగా పూర్తి చేశానని చెప్పారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని పేర్కొన్నారు.
తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ అన్నారు. సుస్మిత వ్యక్తిగత అభిప్రాయాలను తప్పుపట్టే అధికారం తమకు లేదని, బయట వ్యక్తులు చేసే వ్యాఖ్యలకు వారి కుటుంబ సభ్యులను బాధ్యులుగా చేయడం సరికాదని ప్రశ్నించారు. సుమంత్ అరెస్టు కక్షపూరిత చర్యగా భావిస్తున్నానని, తనను కావాలనే మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో కొనసాగాలా వద్దా అనే విషయంపై ఇంకా ఆలోచించలేదని, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషంగా ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!