
రాజకీయాలు

ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మరోసారి పునరుద్ధరించింది. ఆగస్టు 4న విడుదలైన తొలి నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల గడువు ఆగస్టు 12తో ముగిసింది. అయితే పలువురు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న వర్సిటీ రిజిస్ట్రేషన్లను మళ్లీ ప్రారంభించింది.
తాజా నిర్ణయం ప్రకారం ఈరోజు నుంచి ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల వరకు ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మరోసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని వర్సిటీ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!