
టెక్నాలజీ

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా ఎం. అంబానీ ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. దూరదృష్టి గల నాయకత్వం, సంస్థల నిర్మాణంలో విశేష కృషి, సమగ్ర అభివృద్ధి కోసం ఆమె నిరంతర కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, కళల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఆమె నాయకత్వం విశేష ప్రభావాన్ని చూపుతోంది.
నీతా ఎం. అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా ప్రజల జీవితాలను స్పృశించింది. అందులో సుమారు 2.9 కోట్ల మంది పిల్లలు కూడా లబ్ధి పొందారు. సమాజంలోని అన్ని వర్గాలకు విద్య, వైద్యం, జీవనోపాధి అవకాశాలు అందించడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ గుర్తింపు దేశంలో సామాజిక సేవ, దాతృత్వ రంగాల్లో ఆమె నాయకత్వానికి మరో నిదర్శనంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!