
ఓటీటీ

హైదరాబాద్లో ఆషాఢ బోనాల మహోత్సవాలు జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. జులై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు.
ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం జులై 19న సికింద్రాబాద్ బోనాల అంకురార్పణ, జులై 26న బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం, ఆగస్టు 2న లష్కర్ బోనాలు, ఆగస్టు 9న పాతబస్తీ బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 10న సంప్రదాయ రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!