

22A నిషేధిత జాబితాలో ఆస్తులను చేర్చిన వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మల్కాజ్గిరిలో నిర్వహించిన 22A నిషేధిత భూముల బాధితుల సభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. 2008లో ULC చట్టం రద్దైన తర్వాత కూడా ఈ భూములను మళ్లీ నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లాలో సుమారు 7,500 జీవోలు, మేడ్చల్ జిల్లాలో దాదాపు 6,000 జీవోల ద్వారా పెద్ద సంఖ్యలో ఆస్తులు ప్రభావితమయ్యాయని హరీశ్ రావు ఆరోపించారు. 22A జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు కమీషన్లు అడుగుతున్నారన్న ఆరోపణలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి, ఎలాంటి షరతులు లేకుండా ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జరిగిన ఇబ్బందులకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!