

ఆంధ్రప్రదేశ్ తీరంలో బోటు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాణిజ్య నౌక వరకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాను భారత నౌకాదళ హెలికాప్టర్ ద్వారా ఐఎన్ఎస్ డేగాకు తరలించి అనంతరం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
నౌకాదళం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, గస్తీ బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెస్క్యూ ఆపరేషన్ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, గంగవరం తీరానికి సమీపంలోని 12 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపును మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉండటం, బలమైన గాలులు వీయడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!