
సినిమాలు

రేవంత్ రెడ్డి నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పరిపాలనా అంశాలు, పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
ఈ సమావేశంలో ఐఆర్ఎఫ్సీ నుంచి మెట్రో రుణాల విడుదలలో జాప్యం, ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, రైతు భరోసా నిధుల విడుదల తేదీ ఖరారు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని కలిసేందుకు మంత్రుల బృందాన్ని పంపే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!