
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తండ్రి ఆర్థిక మూలాలపై విచారణ జరపాలని ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కోరారు. ఈ మేరకు ఎన్నికల సంఘం, సెంట్రల్ జీఎస్టీ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న అభిజీత్ దిప్కే తండ్రి అమెరికాలో కొడుకు చదువుల కోసం అవసరమైన నిధులను ఎలా సమకూర్చారనే అంశంపై స్పష్టత రావాలని అమిత్ తివారీ పేర్కొన్నారు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ నిధుల వనరులు, చట్టబద్ధతపై కూడా దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!