
రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రాంతాల నుంచి పాల్గొన్న కోటి మందికి పైగా యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని యువతకు పిలుపునిచ్చారు.
దేశ యువతను ఏకం చేసి, వారిని ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యమని గవర్నర్ తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, విద్యలో వెనుకబాటు, సామాజిక దూరం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. వ్యసనాల కారణంగా యువత కుటుంబాలు కూడా మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!