

శ్రీమతి నందమూరి బసవతారకం గారి శతజయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ‘నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ను ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో అన్నదాన కార్యక్రమంతో ట్రస్ట్ కార్యకలాపాలను ప్రారంభించారు. ట్రస్ట్కు నందమూరి మోహనకృష్ణ చైర్మన్గా, నందమూరి మోహన రూపా మేనేజింగ్ ట్రస్టీగా, నందమూరి సీమంతిని, తుమ్మల ప్రసన్న కుమార్ ట్రస్టీలుగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ. నందమూరి తారక రామారావు గారికి ప్రతి అడుగులో అండగా నిలిచి కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా తీర్చిదిద్దిన బసవతారకం గారి సేవలను స్మరించుకున్నారు. ఆమె స్ఫూర్తితో పేదలకు అండగా నిలుస్తూ విద్య, వైద్యం, స్కాలర్షిప్లు వంటి సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు ఈ ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపారు.
మేనేజింగ్ ట్రస్టీ నందమూరి మోహన రూపా మాట్లాడుతూ. ఎన్టీఆర్, బసవతారకం గారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. కుటుంబ సభ్యులు బసవతారకం గారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!