

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘మూకుత్తి అమ్మన్ 2’. గతంలో తమిళం, తెలుగు ప్రేక్షకులను అలరించి విజయం సాధించిన ‘మూకుత్తి అమ్మన్’కు ఇది సీక్వెల్గా తెరకెక్కుతోంది. సీనియర్ దర్శకుడు సుందర్ సి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార మరోసారి పవర్ఫుల్ దేవత పాత్రలో కనిపించనున్నారు. రెజీనా కాసాండ్రా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇషారి గణేష్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
షూటింగ్ ప్రారంభమై చాలాకాలం గడిచినా ఇప్పటివరకు సినిమా థియేట్రికల్ రిలీజ్పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో నయనతార అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రాబోయే దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే రిలీజ్ తేదీపై అధికారిక స్పష్టత కోసం ఎదురుచూడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!