

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఎగువ ప్రాజెక్టులు, కాలువలకు నీటి విడుదల, విద్యుదుత్పత్తి కారణంగా జలాశయంలో నిల్వలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 215.80 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను 162.05 టీఎంసీల నీరు ఉంది. తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, కల్వకుర్తి తదితర మార్గాల ద్వారా కలిపి 48,906 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. జూరాల నుంచి 14,359 క్యూసెక్కులు విడుదల కాగా, శ్రీశైలానికి 15,219 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది.
మరోవైపు గోదావరిలో వరద ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. భద్రాచలం వద్ద 5,83,563 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, పోలవరం ప్రాజెక్టులోకి 5,10,872 క్యూసెక్కుల వరద చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 4,63,583 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద కారణంగా వేలేరుపాడు మండలంలోని ఎద్దువాగు వంతెన, కుక్కునూరు మండలంలోని గుండేటివాగు కాజ్వే నీటమునగడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!