

ఫ్యాన్సీ వాహన నంబర్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నంబర్ల రుసుములను భారీగా పెంచే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రత్యేక, ప్రతిష్ఠాత్మక నంబర్ల కోసం వాహన యజమానులు అధిక మొత్తాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉండటంతో, దీనిని ఆదాయ వనరుగా మలచాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రీమియం కేటగిరీ ఫ్యాన్సీ నంబర్ల కోసం గరిష్టంగా రూ.8 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా ఐదు నుంచి ఎనిమిది ఫ్యూచర్ సిరీస్ నంబర్లకు రూ.1.2 లక్షలు, తొమ్మిది నుంచి పది సిరీస్ నంబర్లకు రూ.2 లక్షలు, 11 నుంచి 12 సిరీస్ నంబర్లకు రూ.4 లక్షలు, 13 నుంచి 14 సిరీస్ నంబర్లకు రూ.8 లక్షలు రుసుముగా నిర్ణయించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే 2012 తర్వాత తమిళనాడులో వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఛార్జీలలో ఇదే అతిపెద్ద మార్పుగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!