

తమిళనాడులోని ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్ ఫోన్ల వినియోగంపై హిందూ ధర్మాదాయ, దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వీఐపీ దర్శనం కోరుకునే వారు కనీసం ఒకరోజు ముందుగానే సంబంధిత ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాఖ పేర్కొంది.
ఆలయాల్లో వీఐపీలతో పాటు భద్రత, నిబంధనల అమలుకు అవసరమైన అధికారులు, సిబ్బంది మాత్రమే ఉండేలా చూడాలని ఆదేశించింది. వారి కదలికలు సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. మరోవైపు ఆలయ ప్రాంగణాల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని కఠినంగా నిషేధించాలని ఆదేశించింది. భక్తులు ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం వంటివి చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆలయాల పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు మొబైల్ వినియోగంపై నిషేధాన్ని తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!