
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వ శాఖలకు అద్దె వాహనాలు అందిస్తున్న యజమానులు రేపటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో నెలవారీ వాహన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేల వరకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ సమ్మెతో సచివాలయం సహా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థలకు అనుబంధంగా ఉన్న 5 వేలకుపైగా అద్దె వాహనాల సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలాగే గత 12 నుంచి 22 నెలలుగా పెండింగ్లో ఉన్న అద్దె బకాయిలను వెంటనే విడుదల చేయాలని వాహన యజమానులు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!