

దేశంలో విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గత పదేళ్లలో 152 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, వాటికి బాధ్యులైన ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ, విద్యార్థుల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండగా, విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం నాశనం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం ముందు మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!