
బిజినెస్

డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్పై మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. కుల, మతాల మధ్య విభేదాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తమిళనాడులో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించిన రఘురామ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటి చర్యలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కేసు విచారణ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ప్రజలకు న్యాయం జరిగేలా "తెలుగు వీర లేవరా" అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!