
క్రీడలు

దక్షిణ కొరియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జూలై 6 నుంచి 11 వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన ఆదివారం సియోల్ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్–దక్షిణ కొరియా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాలు నిర్వహించనున్నారు.
పర్యటనలో టెక్ స్టార్టప్లు, ప్రముఖ పరిశ్రమలు, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడి అవకాశాలపై లోకేశ్ చర్చలు జరపనున్నారు. హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్, ఎల్జీ కెమ్, కొరియన్ మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026ను విజయవంతం చేయడానికి కొరియా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించే రోడ్షోలో కూడా పాల్గొననున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!