

సూపర్స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాపై ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంతో బిజీగా ఉన్న మహేష్.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ పేరు తెరపైకి వచ్చింది. భారీ చిత్రాలు, అద్భుతమైన సెట్లు, గ్రాండ్ విజువల్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భన్సాలీ.. గతంలో పలువురు తెలుగు అగ్ర హీరోలతో సినిమా చేసే అవకాశంపై చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా భన్సాలీ మహేష్ బాబును కలిసి ఓ కథను వినిపించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భన్సాలీ మార్క్లో భారీ సెట్లు, గ్రాండ్ విజువల్స్, ఇంటెన్స్ డ్రామాతో కూడిన కథను మహేష్కు వివరించినట్లు టాక్. అయితే ఈ ప్రాజెక్ట్పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం మహేష్ పూర్తిగా ‘వారణాసి’పైనే దృష్టి పెట్టాడు. ఈ చిత్రం పూర్తయి విడుదలైన తర్వాతే తన తదుపరి ప్రాజెక్ట్పై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ఇప్పుడు భన్సాలీ పేరు తెరపైకి రావడంతో మహేష్ తదుపరి చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!