

తమిళ నటుడు సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’పై ఆసక్తి నెలకొంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటులు సత్యరాజ్, అచ్చుత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తమిళనాడు సముద్రతీర ప్రాంతాలు, మత్స్యకార కుటుంబాల జీవితాలు, ఉత్కంఠభరితమైన సాంప్రదాయ పడవ పోటీల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన తొలి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించి చార్ట్బస్టర్గా నిలిచింది. దీంతో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘తెలుసానికే పిల్లా’ అనే రెండో పాటను ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సూరి, మహిమా నంబియార్ రొమాంటిక్గా కనిపిస్తున్న పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!