

యంగ్ హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి మలయాళ సూపర్ హిట్ చిత్రం ప్రేమమ్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమాలో ఇద్దరూ కలిసి కనిపించకపోయినా, హీరో జీవితంలోని వేర్వేరు దశల్లో కీలక పాత్రలు పోషించారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఒకరికి ఒకరు అండగా నిలుస్తున్నారు. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో సాయి పల్లవిపై తన అభిమానం వ్యక్తం చేస్తూ భావోద్వేగ పోస్టు పెట్టారు.
తాను వేసిన పెయింటింగ్స్ ముందు నిలబడి తీసుకున్న ఫోటోను షేర్ చేసిన అనుపమ, 2021లో తన జీవితంలో అత్యంత కష్టకాలంలో ఈ చిత్రాలను వేసినట్లు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి రంగులంటే ఇష్టం ఉన్నా, పెయింటింగ్ను సీరియస్గా తీసుకోలేదని తెలిపారు. అయితే ఒక క్లిష్ట సమయంలో సాయి పల్లవితో మాట్లాడినప్పుడు, ఆమె ఇచ్చిన వాటర్ కలర్స్ తనలో కొత్త మార్పుకు కారణమయ్యాయని చెప్పారు. తనలోని కొత్త ప్రతిభను బయటకు తీసుకువచ్చినందుకు సాయి పల్లవికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ పెయింటింగ్స్ను ఫ్రేమ్ చేసి స్టూడియోలో అలంకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పారు. దీనికి స్పందించిన సాయి పల్లవి, అనుపమ ప్రతిభను మెచ్చుకుంటూ ప్రేమతో కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!