
సినిమాలు

హైదరాబాద్లో మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ పెట్టుబడి పెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ వ్యాపారంలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ ప్రచారం మరింత వేగంగా వైరల్ అయింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో తన సినిమా ప్రాజెక్టులపైనే దృష్టి సారించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తుండగా, షూటింగ్ సమయంలో గాయపడటంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ పౌరాణిక చిత్రంలో ఆయన నటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!