

వడ్డే నవీన్ పదేళ్లకు పైగా విరామం తర్వాత ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కమల్ తేజ నార్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వడ్డే నవీన్, అందరికీ నచ్చే మంచి కథ కోసం చాలా కాలంగా ఎదురు చూసినట్లు తెలిపారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబమంతా కలిసి చూడగలిగే కథ కావడంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నానని చెప్పారు. ప్రేక్షకుల అభిరుచులు మారిన నేపథ్యంలో కొత్త తరహా కథలవైపు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో త్రిమూర్తులు అనే నిజాయతీగల పోలీసు కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నానని ఆయన వెల్లడించారు. విధుల్లో నిజాయతీ కారణంగా 55 సార్లు బదిలీ అయ్యే వ్యక్తి జీవితంలో 55వ బదిలీ తర్వాత జరిగే పరిణామాలే కథగా సాగుతాయని తెలిపారు. వినోదం, ఉత్కంఠ, అనూహ్య మలుపులతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. మంచి కథలు వస్తే మల్టీస్టారర్ చిత్రాలు, ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ నటించడానికి సిద్ధంగా ఉన్నానని వడ్డే నవీన్ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!