
జనరల్

నాని స్థాపించిన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రెండో చిత్రంగా అలియాస్ రుక్మిణి అధికారికంగా ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తుండగా, దీప్తి గంతా నిర్మిస్తున్నారు. ఆసక్తిని రేకెత్తించే అనౌన్స్మెంట్ వీడియోతో చిత్ర టైటిల్ను విడుదల చేశారు.
వీడియోలో నాని, దర్శకుడు కథ గురించి మాట్లాడుతుండగా, 'కృష్ణ కథ' అని చెప్పిన దర్శకుడు రుక్మిణి రాసిన నవలలను చూపిస్తూ ఆసక్తిని పెంచారు. చివర్లో గణిత ఉపాధ్యాయుడిగా కనిపించిన నితిన్ "మై వైఫ్" అంటూ చెప్పడంతో కథపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. సినిమాకు జోమన్ టి. జాన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!