

ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలను వేగవంతం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే అన్ని జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీల్లో 13,151 చోట్ల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు గుర్తించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ పూర్తికావడంతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లాలకు సూచనలు జారీ చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఒకే రోజు పోలింగ్ నిర్వహించే విధానంపై చర్చ జరుగుతోంది. నామినేషన్లు, అభ్యర్థుల వివరాలు, పోలింగ్, ఫలితాల వరకు మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక పోర్టల్ను కూడా సిద్ధం చేసింది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి సన్నద్ధతలో ఉందని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!