

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జూన్ 6న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న పలు వివాదాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రతినిధులు నీట్, ఎస్ఎస్సీ, సీబీఎస్ఈ వంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఫలితాల్లో లోపాలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు.
సీజేపీ సభ్యుడు, జర్నలిస్టు సౌరవ్ దాస్ మాట్లాడుతూ పరీక్షల వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావడమే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ దాదాపు 8 లక్షల మంది సంతకాలు చేసిన పిటిషన్ను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు అధికారులను బదిలీ చేయడం సరిపోదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!