

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం, ఆగస్టు 12న ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ప్రతిపక్ష డీఎంకే మద్దతు తెలిపింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం తీసుకొచ్చిన తీర్మానానికి డీఎంకే మద్దతు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
ప్రస్తుత 543 లోక్సభ స్థానాల సంఖ్యను కొనసాగించాలని, లోక్సభ-రాజ్యసభ స్థానాల ప్రస్తుత 2.2:1 నిష్పత్తిని కొనసాగించాలని తీర్మానం కేంద్రాన్ని కోరింది. అలాగే, ప్రస్తుత 543 స్థానాల ఆధారంగానే 2029 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేసింది. డీఎంకే మద్దతు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!