
జనరల్

మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఘాటుగా స్పందించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన మేరకు యూరియాను సరఫరా చేస్తోందని, రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వమే విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలకు కేంద్రాన్ని బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నారు.
ఢిల్లీలో ధర్నా చేసిన వ్యక్తి ఎక్కడున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించిన రఘునందన్రావు, రేపు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు యువ నాయకుడిగా ప్రజల మధ్య చురుకుగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ అధ్యక్షుడిపై కూడా విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!