
క్రీడలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండలంలో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. 2006లో జడ్పీటీసీగా తొలి విజయం సాధించిన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని జులై 4న నిర్వహిస్తున్నారు. సాధారణ రాజకీయ సభగా కాకుండా కృతజ్ఞత సమర్పణగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం ముందుగా ఊరుకొండ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచిన అనుచరులతో భోజనం చేస్తారు. మిడ్జిల్లో విగ్రహావిష్కరణలు చేసి, అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!