

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2024 ఎన్నికలకు ముందు, తర్వాత సామాజిక మాధ్యమాల్లో తన కుమార్తె కేసుకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వీడియోలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె ఆరోపించారు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంటూ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
పార్వతి మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరిగే వరకు పోరాడతానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె కేసును తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కల్యాణ్పై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. ఫిర్యాదు అందినట్లు గన్నవరం పోలీసులు ధృవీకరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!